Sunday, 28 April 2013

Great Journalist Kishore Nayak

జర్నలిజం గురుంచి జర్నలిస్టుల గురుంచి, జానపాడు అరుగుల మీద కూర్చునే వాళ్ళ దగ్గర నుంచి Supreme Court జడ్జిల దాకా అందరూ చెప్పే మాట .."విలువలు పడిపోతున్నాయి..వ్యాపారం చేస్తున్నారు.. ఎక్కడా బతకలేక ఇక్కడ కొచ్చి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు" అని.... కానీ "కిషోర్ నాయక్ " లాంటి కలాలు జనం గళాలకి అక్షర రూపం ఇస్తూ ఉండబట్టే ఇంకా "పాత్రికేయ" వృత్తికి విలువ తరగకుండా వుంది....
అవినీతి కలాలతో ,అక్రమ కెమెరాలతో సమాజం మీద అసుద్దం గక్కుతూ రాజ్యాంగ వ్యవస్థలని చెరబడుతున్న నేటి కాలంలోనే... వ్యక్తిగత గుర్తింపు కన్నా సామాజిక బాద్యత,సామాన్యుని రక్షణ ముఖ్యమని భావించే ఎందఱో "నాయక్" లు కలాలతో,కెమేరాలతో మన చుట్టూ రక్షణగా నిలవబట్టే ఈ మాత్రం స్వేఛ్చ,స్వాతంత్ర్యం అన్నా మనకి మిగిలాయి...పాత్రికేయ వృత్తిని దివిటీలుగా వెలిగిస్తున్న "నాయక్"లందరికి వందనా
లు..

No comments:

Post a Comment