Sunday, 28 April 2013

ఢిల్లీ లో మృగాల్ల పైచాచికం..."

ఛీ... ఛీ... మనదీ ఓబతుకేనా... కుక్కలవలే, నక్కలవలే అని శ్రీశ్రీ అన్న మాటలను ఆయన బతికుంటే మార్చేవారు, కారణం మనం ఇప్పుడు కుక్కలు, నక్కలకన్నా హీనంగా బతుకుతున్నాం. అవి జంతువులే అయినా అవి వాటిపుట్టుక నడవడిని దాటి మరోరకంగా బతకడం లేదు. కాని మనిషి తన అసలు రూపం వదలిపెట్టి మృగాని కంటే హీనంగా ప్రవర్తిస్తూ జాతి మనుగడనే భయకంపితం చేస్తున్నాడు. ఇది సాధారణ మనుషులే కాదు పాలించే పాలకులు సైతం అదే దారిని ఎంచుకోవడంతో ప్రపంచదేశాల్లో ఓవెలుగు వెలిగిన మన భరతజాతి ఇక జీవచ్ఛవంలా మారిపోయే పరిస్థితులు దగ్గరపడుతున్నాయనిపిస్థుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృటించి అత్యాచారల నిరోధానికి ప్రత్యేక చట్టం చేయడానికి కారణమైన నిర్భయ వ్యవహారం మరవక ముందే మరో చిన్నారిని ఒక క్రూర మానవ మృగం చిదిమేసిన సంఘటన దేశవ్యాప్తంగా మరో మారు దేశ ప్రజలను నేస్తేజం లో కి నెట్టింది. నిజంగా వార్త పత్రికలో ఆ చిన్నారి పై జరిగిన వికృత చర్యను చదువుతుంటేనే ఆ మ్రుగాడిని నడి రోడ్డులో నరికి చంపాలి అనే అంత ఉద్రేకం, ఉద్వేగం కలుగుతుంది. చెప్పడానికి, రాయడానికి వీలు లేకుండా ఆ నర రూప రాక్షసుడు చేసిన చేష్టలు ఘోరాతి ఘొరం ఆ క్షణాన ఆ పసి తల్లి ఎంత తల్లడిల్లి ఉంటుంది, ఆ పసి ప్రాణం ఎంత కొట్టుమిట్టదిడున్తుంది. దానిపై మన పోలీసు వ్యవస్థ స్పందిన తీరు మరి విడ్డురం ఆ పసి తల్లిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించమని ఆందోళన చేస్తే వాడి ఆస్తులు రాసి ఇవ్వమనట్లు ప్రశ్నించిన ఆ యువతీ చెవి పగల కొట్టాడు. ఇదేనా మన ప్రజాసౌమ్యం ఇదే మనకు వచ్చిన స్వాతంత్ర్యం.
-సన్నీ జర్నలిస్ట్

No comments:

Post a Comment