మన కాలం వీరుడు...!!
----------------------
అవును మల్లోజుల కోటేశ్వరరావు బతికి ఉన్నాడు. సజీవంగా కలల్లో కాదు. బతుకు సజీవంగా నడుస్తున్నప్పుడే కలవరపెడ్తుంటాడు. బోధిస్తుంటాడు. దారి చూపుతుంటాడు. సమాజం కుళ్లుతున్నప్పుడల్లా, ఆ కుళ్లు మురిగి, శస్త్ర చికిత్సలు అవసరమైనప్పుడల్లా మల్లోజుల సజీవంగా కదలాడుతాడు. కనీస మానవ విలువలు పాటించడానికి, మనిషి సామాజిక జీవిగా సమాజం మెరుగుదల కోసం ప్రేరకుడు కావాలనడానికి, నిజాయి
తీగా మెసలడానికి,
బతుకు దారి తప్పకుండా ఉండడానికి, మనిషిలో మానవీయ విలువలు అంతరించకుండా
ఉండడానికి అతనొక ‘కాన్షష్ కీపర్’. అతను చనిపోయినా బతికి ఉండే విలువ. అతనొక
చరివూతను నిర్మించాడు.
దరిదాపు అదొక నలభై ఏళ్ల చరిత్ర. ఈ నేల మీద నడిచిన చరిత్ర. నిత్య యుద్ధరంగంలో కార్యక్షేవూతంలో అలుపెరుగని చరిత్ర. చరిత్ర తనను తాను కనుగొని ముప్ఫై దేళ్లకు మురిసిపోవడమే వర్తమానం. నక్సల్బరీ బెంగాల్లో అస్తమిస్తున్నప్పుడు పెద్దపల్లి నుంచి వెళ్లిన ఒక విప్లవకారుడు లాల్గఢ్ వెలిగించడం ఒక చరిత్రే. నక్సల్బరీ పతనమైందనుకున్న కానూ సన్యాల్ ఆత్మహత్య చేసుకున్నప్పుడే, కిషన్జీ బెంగాల్లో తొలి ఏనాన్, లాల్గఢ్ను విముక్తి ప్రాంతమని ప్రకటించాడు. చరివూతలో ఏమి వైవిధ్యం. కోలకతా కాఫీ క్లబ్బుల్లో డ్బైయవ దశకంలో విరిసిన మేధో విప్లవం. తేయాకు తోటల్లో ప్రతిఫలించి అదొక భారతీయ ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రంగా ఆవిష్కృతమైంది. విప్లవం వాస్తవాల పునాదుల మీద మొలిచే ఒక రొమాంటిక్ స్వప్నం. దాన్ని కలగనడమే. కానీ విప్లవాన్ని నిర్మించడం కష్టం. తన రక్తంలో విప్లవాన్ని ఉరికించి కేవలం కార్యరంగంలో మాత్రమే ఉండడం మరీ కష్టం.
పతనమైన జెండాను నిలబెట్టడం కష్టం. విప్లవాలు ఒక ప్రాంతంలో ఆరిపోతే మరో ప్రాంతంలో మొలకెత్తుతాయి. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తాయి కానీ, నిరాశలోకి, నిస్పృహలోకి, మరి పడి లేవని విరిగిన కెరటమైనట్టే ఉన్నచోట మళ్లీ విప్లవం నిర్మించవచ్చునని, నిరూపించిన ప్రథమ భారతీయ విప్లవకారుడు కిషన్ జీ. ఆ తొలి ఏనాన్ నిజార్థంలో ఒక విముక్తి ప్రాంతమా? అదొక అపసవ్యపు పరికల్పనా? అరకొర అల్పసంతోషపు, అతివాద, దుందుడుకు ప్రకటనా? అది ఇవ్వా ళ ఉందా? అవన్నీ వేరు. కానీ బెంగటిల్లిన విప్లవాల ఖిల్లా బెంగాల్లో ఆయన లాల్గఢ్ను కన్నాడు. గ్రేట్. విప్లవం రొమాంటిక్గానే ఉంటుంది. కుదురుగా ఉన్న ప్రపంచాన్ని అది కుదిపికుదిపి ఇబ్బంది పెడుతుంది. కుదురుగానూ, నిశ్చలంగానూ, స్థిరంగానూ ఉన్న సమాజాలనది అల్లకల్లోలం చేస్తుంది. లాల్గఢ్ అదే చేసింది. సీపీఎం పాతుకున్న పునాదులను పెకిలించింది. కట్టుకున్న వెలిసిపోయిన ఎర్రకోటలను కూల్చింది. బెంగాల్ ప్రపంచాన్ని అది మేల్కొలిపింది.
మన్ను దిన్న పాముల్లా , జర్దాపాన్లు నములుతూ, చేపలు తింటూ విప్లవాలను ఆరామ్ పడక కుర్చీలకు పరిమితం చేసిన భద్రలోకపు మేధావులను అది దిగ్గున మేల్కొలిపింది. కాఫీ క్లబ్బుల్లో నెత్తురు నిండింది. బెంగాల్ను నలభై సంవత్సరాల క్రితం చారుమజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంథాల్ ఆవహించారు. ఇప్పుడు బెంగాల్ను కిషన్జీ ఆవహించాడు. చరివూతను నిరాకరించలేం. కిషన్జీ ఇప్పటికిప్పుడే ఒక చరి త్ర కూడా కాదు. ఒక మనిషి జీవితకాలపు శక్తి యుక్తుల గురించి మాట్లాడుకుం దాం. విప్లవం గురించి అట్లా విడిచిపెడదాం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో తన పాదమువూదలు వేయడం ఎలా సాధ్యం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి ఆసోం దాకా విప్లవాల కలలను ఎగజల్లడం ఎలా సాధ్యం. ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ ఒక సైన్యం తయారు కావడం ఎలా సాధ్యం. ఆయనేమన్నా... జానపద హీరోనా..? వేయి చేతులు, వేల కాళ్లు, లక్షల ఆలోచనలు ఏకకాలంలో అనేక పనులు చేయగలిగిన మహిమాన్వితుడా? కాదు. మల్లోజుల కోటేశ్వరరావు ఒక మనిషి. మామూలు మనిషి. ప్రేమగా మాట్లాడే మనిషి. ప్రేమగా నలుగురితో నవ్వుతూ మాట్లాడే మనిషి.
కానీ కలలుగనే మనిషి. కాల్పనిక జగత్తుగల మనిషి. రొమాంటిక్ రెవల్యూషనరీ.. అతనికి ‘డేర్ టు డ్రీమ్’ తెలుసు. కోటేశ్వరరావు ఒక అగ్రశేణి, అత్యుత్తమ విప్లవకారుడు. నమ్మిన విశ్వాసాల కోసం కార్యరంగం ప్రజలే అని, నేల తల్లి విముక్తి కోసం దేశవ్యాప్త విప్లవాన్ని కలగన్నాడు మల్లోజుల. ఆ కల సాకారం కోసం ఆయన దేశం మనిషి అయ్యాడు. బెంగాల్లో కిషన్జీ అయ్యాడు. చియాపస్ కొండల్లో సబ్ కమాండెంట్(జపటిస్టా) మార్కోస్ లాగే అతను సిద్ధాంత కర్త. కవి. కలలు కనేవాడు. కలలను ఏరుకుని నిజం చేయడానికి ఎకె 47 ధరించేవాడు. కలష్నికోవ్ గురిపె మార్కోస్ మాజీ మావోయిస్టు. క్రిస్తాంబుల్కు గుర్రం మీద ఊరేగి దేశీ మూలవాసుల సేనను ప్రదర్శించాడు మార్కోస్. నెట్నిండా నిండి ఉన్నడు మార్కోస్. మల్లోజుల కోటేశ్వరరావు మావోయిస్టు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన కరీంనగర్ నుంచి జంగల్ మహల్ దాకా కార్యాచరణలో ఉన్నాడు.
ఉత్త బోలు నైజమున్న, పనికిరాని చెత్తను జర్నలిజంగా ప్రచారంచేసే ఆత్మలేని ఢిల్లీ నగరపు పత్రికలు ‘కిల్లింగ్ మెషిన్ కిషన్జీ’ అని అభివర్ణించిన మల్లోజుల అమ్మకు ఉత్తరం రాయగలడు. అమ్మా ఎట్లున్నవే.. భయపడకే అమ్మా.. నేనొక యుద్ధంలో ఉన్నాను. నీ తెలంగాణ నువ్వు, నీ హైదారాబాద్ నువ్వు కాపాడుకోవాలే అమ్మా!అని ఆప్యాయంగా అక్షర సందేశాలు పంపించగలడు. కవిత్వం రాయగలడు. ప్రపంచం ప్రశాంతంగా, ఏ దోపిడీ, పీడన లేకుండా ఆదివాసీ, మూలవాసీ , కార్మికుడు, రైతు, ప్రపంచ పీడన, దోపిడీలేని ఒక మహత్తర సమాజాన్ని కలగనగలడు. విప్లవకారుడి ఆత్మ పీడకున్ని పసిగడుతుంది. దోపిడీని పసి గడ్తుంది. పీడితుల వేపు కొట్టుకుంటుంది. ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది. ఇదం తా సాధ్యమా? అనుకుంటుంది ప్రపంచం. సాధ్యమే అంటాడు విప్లవకారుడు. పీడితుల సైన్యాన్ని తయారు చేయడమే కిషన్జీ లక్ష్యం. అయిదారేళ్లు విప్లవకారులుగా ఉండొచ్చు. ఇక చాలు అనుకున్నప్పుడు ఎవరి కలుగులోకి వారు దూరి అప్పుడప్పుడు కలుగులోంచి బయటకొచ్చి విప్లవాల గురించి మాట్లాడవచ్చు.
కానీ జీవితాంతం విప్లవకారునిగా ఉండే వాడే ఒక చరిత్ర నిర్మాత. భారతీయ విప్లవంలో ఒక చారుమజుందార్తో పోల్చదగిన పెద్దపల్లి విప్లవకారుడు మల్లోజుల. అతను జీవితకాలపు విప్లవకారుడు. ముప్పది నాలుగేళ్లుగా అతను ప్రజల్లో ఉన్నా డు. ఒక్క పోలీసులకు తప్ప సమస్త ప్రపంచంలోనూ అతనున్నాడు. ఒక సృజనశీలి మేధావిగా అతను ప్రపంచాన్ని శాసించాడు. అంగీకరిస్తావా? అంగీకరించవా? సిద్ధాంతం తప్పా? ఒప్పా? తుపాకి గొట్టంతో విప్లవం వస్తుందా? రాదా? ఇవన్నీ మర్యాదస్తుడి మనాదలు. అతనికే మనాదలు లేవు. అతనొక నిరంతర విశ్వాసంతో విప్లవం కోసం పనిచేశాడు. తెలంగాణ ఒక ఆత్మ కోటేశ్వరరావు. తెలంగాణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అజేయంగా, అమేయంగా ప్రజల మనిషిలా జీవించిన వాడు కిషన్జీ. తొలి తెలంగాణ ఉద్యమం మల్లోజులను మలిచింది. అది జగి త్యాల జైత్రయాత్రగా ఊరేగింది. అది ‘రోడ్ టు రెవల్యూషన్’గా భారతదేశపు విప్ల వం అయింది. మలి తెలంగాణ మల్లోజుల మద్దతు పొందింది. ఒక యుద్ధ వారసత్వం, కత్తి పట్టిన వాడి తెగువ చూపిన వారసత్వం, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కిషన్ జీది.
అతను భారతదేశంలో ఒక తెలంగాణ అరుణ నక్షవూతంలా వెలిగినవాడు. ఒక మనిషి తనజీవిత కాలంలో కోటానుకోట్ల మంది నాలుకల మీద నానడం అంత సులభమైందేమీ కాదు. ఒక మనిషి కోట్ల మందికి ఇతడే మా హీరో అనిపించి ఒక విముక్తి ప్రదాతగా కనిపించడం సులభం కాదు. ఒక జీవిత కాలంలో నమ్మిన సిద్ధాంతాన్ని, ఆచరించడం, ఆచరణాత్మక అన్వయంతో సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసుకోవడం, విప్లవాన్ని క్షేత్రంలో ప్రయోగించి, అస్త్ర శస్త్రాలు తయారు చేసుకోవడం, ఒక కల కనడం.. ఆ కల కోసం పరితపించడం, పనిచేయడం, నేలమీద ఒక జానపద కథానాయకునిలా అనేక యుద్ధాల్లో ఆరితేరడం ఎవరికి సాధ్యం. అవన్నీ మల్లోజుల కోటేశ్వరరావు అర్థంతరంగా ముగిసిన ఒక జీవితంలోనే ఆచరించి చూపాడు. ఒక తెలంగాణ పోరాట యోధుడు తన అత్యున్నత కార్యాచరణతో ఒక చరివూతను నిర్మించాడు. భారతదేశ చరివూతలో ఇక రాసుకోండి అదొక విప్లవకారుని చరిత్ర. ఆయన పేరు మల్లోజుల కోటేశ్వరరావు. అలియస్ కిషన్జీ.
ఇక నుంచి ఈ దేశ విప్లవ చరిత్ర కిషన్ జీతో ప్రారంభమవుతుంది. మీరు నిరాకరిస్తారా? మీరతణ్ని ‘కిల్లింగ్ మెషిన్’ అంటారా? మీరతణ్ని మీ కలల్లోకి రాకుండా జాగ్రత్తపడతారా? మీరతణ్ని గమనించనట్టుగా ఏమరుపాటు ప్రదర్శిస్తారా? కుదరదు. ఇక నుంచీ ఈ దేశపు పోలీసులకు, ఈ దేశంలో అభివృద్ధి విధ్వంసం సృష్టించి అసమానతలు పెంచి, సంపద పోగేసి, సహజ న్యాయాలను, సహజవనరులను కొల్లగొట్టిన ప్రభుత్వాలకు, రాజ్యానికి, అతనొక పెను సవాల్. కలష్నికోవ్ ఎక్కుపెట్టిన ఒక కిషన్ జీ చరిత్ర మీకు పీడ కలలు మిగులుస్తుంది. సమాజం అస్తవ్యస్తంగా ఉన్నంత కాలం.. మనుషులు కిషన్ జీ కోసమే ఎదురుచూస్తుంటారు. అతని శవం కోసం కాదు. అతను భారత దేశపు పీడిత జనుల రక్తంలో కలిసిపోయినవాడు. కాఫీ క్లబ్ల్లో, రంగస్థలాల మీద అతను తారుమారు నాటకాల తెరదించగల సమర్థ యోధుడు. కలలో, మెలకువులో చిరకాలం జీవిం చి ఉండేవాడు. కిషన్ జీని చంపడం సాధ్యమా? మధురమ్మ వలపోస్తున్నది.
‘నీకు అడివిల చలి పుడుతలేదా? నిన్ను శవంగ చేసి మూటగట్టి పడేసిండ్రా? కొడుకా! కన్నపేగు కదులుతుందిరా’ కన్నతల్లి కదిలి కదిలి ఏడుస్తున్నది. కానీ పాదాలు చెక్కేసి, ముఖం చెక్కేసి కోటేశ్వరరావు పార్థివ దేహం మూటగట్టి వస్తున్నది. తట్టుకోగలవా.. తల్లీ..రాజ్యం క్రూరమైన జంతువు. అది వేటాడుతుం టుం ది. అనంతంగా.. రాజ్యానికి పీడ కలలిచ్చినవాడు కిషన్ జీ. అతని స్మృతినీ దక్కనివ్వరా! అమ్మా.. నువ్వొక చరివూతను కనిపెంచిన వీరమాతవు. కిషన్ జీ పరివ్యాప్త మవుతున్నాడు. యాదిలో... మనాదిలో...
-(అల్లం నారాయణ)
దరిదాపు అదొక నలభై ఏళ్ల చరిత్ర. ఈ నేల మీద నడిచిన చరిత్ర. నిత్య యుద్ధరంగంలో కార్యక్షేవూతంలో అలుపెరుగని చరిత్ర. చరిత్ర తనను తాను కనుగొని ముప్ఫై దేళ్లకు మురిసిపోవడమే వర్తమానం. నక్సల్బరీ బెంగాల్లో అస్తమిస్తున్నప్పుడు పెద్దపల్లి నుంచి వెళ్లిన ఒక విప్లవకారుడు లాల్గఢ్ వెలిగించడం ఒక చరిత్రే. నక్సల్బరీ పతనమైందనుకున్న కానూ సన్యాల్ ఆత్మహత్య చేసుకున్నప్పుడే, కిషన్జీ బెంగాల్లో తొలి ఏనాన్, లాల్గఢ్ను విముక్తి ప్రాంతమని ప్రకటించాడు. చరివూతలో ఏమి వైవిధ్యం. కోలకతా కాఫీ క్లబ్బుల్లో డ్బైయవ దశకంలో విరిసిన మేధో విప్లవం. తేయాకు తోటల్లో ప్రతిఫలించి అదొక భారతీయ ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రంగా ఆవిష్కృతమైంది. విప్లవం వాస్తవాల పునాదుల మీద మొలిచే ఒక రొమాంటిక్ స్వప్నం. దాన్ని కలగనడమే. కానీ విప్లవాన్ని నిర్మించడం కష్టం. తన రక్తంలో విప్లవాన్ని ఉరికించి కేవలం కార్యరంగంలో మాత్రమే ఉండడం మరీ కష్టం.
పతనమైన జెండాను నిలబెట్టడం కష్టం. విప్లవాలు ఒక ప్రాంతంలో ఆరిపోతే మరో ప్రాంతంలో మొలకెత్తుతాయి. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తాయి కానీ, నిరాశలోకి, నిస్పృహలోకి, మరి పడి లేవని విరిగిన కెరటమైనట్టే ఉన్నచోట మళ్లీ విప్లవం నిర్మించవచ్చునని, నిరూపించిన ప్రథమ భారతీయ విప్లవకారుడు కిషన్ జీ. ఆ తొలి ఏనాన్ నిజార్థంలో ఒక విముక్తి ప్రాంతమా? అదొక అపసవ్యపు పరికల్పనా? అరకొర అల్పసంతోషపు, అతివాద, దుందుడుకు ప్రకటనా? అది ఇవ్వా ళ ఉందా? అవన్నీ వేరు. కానీ బెంగటిల్లిన విప్లవాల ఖిల్లా బెంగాల్లో ఆయన లాల్గఢ్ను కన్నాడు. గ్రేట్. విప్లవం రొమాంటిక్గానే ఉంటుంది. కుదురుగా ఉన్న ప్రపంచాన్ని అది కుదిపికుదిపి ఇబ్బంది పెడుతుంది. కుదురుగానూ, నిశ్చలంగానూ, స్థిరంగానూ ఉన్న సమాజాలనది అల్లకల్లోలం చేస్తుంది. లాల్గఢ్ అదే చేసింది. సీపీఎం పాతుకున్న పునాదులను పెకిలించింది. కట్టుకున్న వెలిసిపోయిన ఎర్రకోటలను కూల్చింది. బెంగాల్ ప్రపంచాన్ని అది మేల్కొలిపింది.
మన్ను దిన్న పాముల్లా , జర్దాపాన్లు నములుతూ, చేపలు తింటూ విప్లవాలను ఆరామ్ పడక కుర్చీలకు పరిమితం చేసిన భద్రలోకపు మేధావులను అది దిగ్గున మేల్కొలిపింది. కాఫీ క్లబ్బుల్లో నెత్తురు నిండింది. బెంగాల్ను నలభై సంవత్సరాల క్రితం చారుమజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంథాల్ ఆవహించారు. ఇప్పుడు బెంగాల్ను కిషన్జీ ఆవహించాడు. చరివూతను నిరాకరించలేం. కిషన్జీ ఇప్పటికిప్పుడే ఒక చరి త్ర కూడా కాదు. ఒక మనిషి జీవితకాలపు శక్తి యుక్తుల గురించి మాట్లాడుకుం దాం. విప్లవం గురించి అట్లా విడిచిపెడదాం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో తన పాదమువూదలు వేయడం ఎలా సాధ్యం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి ఆసోం దాకా విప్లవాల కలలను ఎగజల్లడం ఎలా సాధ్యం. ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ ఒక సైన్యం తయారు కావడం ఎలా సాధ్యం. ఆయనేమన్నా... జానపద హీరోనా..? వేయి చేతులు, వేల కాళ్లు, లక్షల ఆలోచనలు ఏకకాలంలో అనేక పనులు చేయగలిగిన మహిమాన్వితుడా? కాదు. మల్లోజుల కోటేశ్వరరావు ఒక మనిషి. మామూలు మనిషి. ప్రేమగా మాట్లాడే మనిషి. ప్రేమగా నలుగురితో నవ్వుతూ మాట్లాడే మనిషి.
కానీ కలలుగనే మనిషి. కాల్పనిక జగత్తుగల మనిషి. రొమాంటిక్ రెవల్యూషనరీ.. అతనికి ‘డేర్ టు డ్రీమ్’ తెలుసు. కోటేశ్వరరావు ఒక అగ్రశేణి, అత్యుత్తమ విప్లవకారుడు. నమ్మిన విశ్వాసాల కోసం కార్యరంగం ప్రజలే అని, నేల తల్లి విముక్తి కోసం దేశవ్యాప్త విప్లవాన్ని కలగన్నాడు మల్లోజుల. ఆ కల సాకారం కోసం ఆయన దేశం మనిషి అయ్యాడు. బెంగాల్లో కిషన్జీ అయ్యాడు. చియాపస్ కొండల్లో సబ్ కమాండెంట్(జపటిస్టా) మార్కోస్ లాగే అతను సిద్ధాంత కర్త. కవి. కలలు కనేవాడు. కలలను ఏరుకుని నిజం చేయడానికి ఎకె 47 ధరించేవాడు. కలష్నికోవ్ గురిపె మార్కోస్ మాజీ మావోయిస్టు. క్రిస్తాంబుల్కు గుర్రం మీద ఊరేగి దేశీ మూలవాసుల సేనను ప్రదర్శించాడు మార్కోస్. నెట్నిండా నిండి ఉన్నడు మార్కోస్. మల్లోజుల కోటేశ్వరరావు మావోయిస్టు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన కరీంనగర్ నుంచి జంగల్ మహల్ దాకా కార్యాచరణలో ఉన్నాడు.
ఉత్త బోలు నైజమున్న, పనికిరాని చెత్తను జర్నలిజంగా ప్రచారంచేసే ఆత్మలేని ఢిల్లీ నగరపు పత్రికలు ‘కిల్లింగ్ మెషిన్ కిషన్జీ’ అని అభివర్ణించిన మల్లోజుల అమ్మకు ఉత్తరం రాయగలడు. అమ్మా ఎట్లున్నవే.. భయపడకే అమ్మా.. నేనొక యుద్ధంలో ఉన్నాను. నీ తెలంగాణ నువ్వు, నీ హైదారాబాద్ నువ్వు కాపాడుకోవాలే అమ్మా!అని ఆప్యాయంగా అక్షర సందేశాలు పంపించగలడు. కవిత్వం రాయగలడు. ప్రపంచం ప్రశాంతంగా, ఏ దోపిడీ, పీడన లేకుండా ఆదివాసీ, మూలవాసీ , కార్మికుడు, రైతు, ప్రపంచ పీడన, దోపిడీలేని ఒక మహత్తర సమాజాన్ని కలగనగలడు. విప్లవకారుడి ఆత్మ పీడకున్ని పసిగడుతుంది. దోపిడీని పసి గడ్తుంది. పీడితుల వేపు కొట్టుకుంటుంది. ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది. ఇదం తా సాధ్యమా? అనుకుంటుంది ప్రపంచం. సాధ్యమే అంటాడు విప్లవకారుడు. పీడితుల సైన్యాన్ని తయారు చేయడమే కిషన్జీ లక్ష్యం. అయిదారేళ్లు విప్లవకారులుగా ఉండొచ్చు. ఇక చాలు అనుకున్నప్పుడు ఎవరి కలుగులోకి వారు దూరి అప్పుడప్పుడు కలుగులోంచి బయటకొచ్చి విప్లవాల గురించి మాట్లాడవచ్చు.
కానీ జీవితాంతం విప్లవకారునిగా ఉండే వాడే ఒక చరిత్ర నిర్మాత. భారతీయ విప్లవంలో ఒక చారుమజుందార్తో పోల్చదగిన పెద్దపల్లి విప్లవకారుడు మల్లోజుల. అతను జీవితకాలపు విప్లవకారుడు. ముప్పది నాలుగేళ్లుగా అతను ప్రజల్లో ఉన్నా డు. ఒక్క పోలీసులకు తప్ప సమస్త ప్రపంచంలోనూ అతనున్నాడు. ఒక సృజనశీలి మేధావిగా అతను ప్రపంచాన్ని శాసించాడు. అంగీకరిస్తావా? అంగీకరించవా? సిద్ధాంతం తప్పా? ఒప్పా? తుపాకి గొట్టంతో విప్లవం వస్తుందా? రాదా? ఇవన్నీ మర్యాదస్తుడి మనాదలు. అతనికే మనాదలు లేవు. అతనొక నిరంతర విశ్వాసంతో విప్లవం కోసం పనిచేశాడు. తెలంగాణ ఒక ఆత్మ కోటేశ్వరరావు. తెలంగాణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అజేయంగా, అమేయంగా ప్రజల మనిషిలా జీవించిన వాడు కిషన్జీ. తొలి తెలంగాణ ఉద్యమం మల్లోజులను మలిచింది. అది జగి త్యాల జైత్రయాత్రగా ఊరేగింది. అది ‘రోడ్ టు రెవల్యూషన్’గా భారతదేశపు విప్ల వం అయింది. మలి తెలంగాణ మల్లోజుల మద్దతు పొందింది. ఒక యుద్ధ వారసత్వం, కత్తి పట్టిన వాడి తెగువ చూపిన వారసత్వం, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కిషన్ జీది.
అతను భారతదేశంలో ఒక తెలంగాణ అరుణ నక్షవూతంలా వెలిగినవాడు. ఒక మనిషి తనజీవిత కాలంలో కోటానుకోట్ల మంది నాలుకల మీద నానడం అంత సులభమైందేమీ కాదు. ఒక మనిషి కోట్ల మందికి ఇతడే మా హీరో అనిపించి ఒక విముక్తి ప్రదాతగా కనిపించడం సులభం కాదు. ఒక జీవిత కాలంలో నమ్మిన సిద్ధాంతాన్ని, ఆచరించడం, ఆచరణాత్మక అన్వయంతో సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసుకోవడం, విప్లవాన్ని క్షేత్రంలో ప్రయోగించి, అస్త్ర శస్త్రాలు తయారు చేసుకోవడం, ఒక కల కనడం.. ఆ కల కోసం పరితపించడం, పనిచేయడం, నేలమీద ఒక జానపద కథానాయకునిలా అనేక యుద్ధాల్లో ఆరితేరడం ఎవరికి సాధ్యం. అవన్నీ మల్లోజుల కోటేశ్వరరావు అర్థంతరంగా ముగిసిన ఒక జీవితంలోనే ఆచరించి చూపాడు. ఒక తెలంగాణ పోరాట యోధుడు తన అత్యున్నత కార్యాచరణతో ఒక చరివూతను నిర్మించాడు. భారతదేశ చరివూతలో ఇక రాసుకోండి అదొక విప్లవకారుని చరిత్ర. ఆయన పేరు మల్లోజుల కోటేశ్వరరావు. అలియస్ కిషన్జీ.
ఇక నుంచి ఈ దేశ విప్లవ చరిత్ర కిషన్ జీతో ప్రారంభమవుతుంది. మీరు నిరాకరిస్తారా? మీరతణ్ని ‘కిల్లింగ్ మెషిన్’ అంటారా? మీరతణ్ని మీ కలల్లోకి రాకుండా జాగ్రత్తపడతారా? మీరతణ్ని గమనించనట్టుగా ఏమరుపాటు ప్రదర్శిస్తారా? కుదరదు. ఇక నుంచీ ఈ దేశపు పోలీసులకు, ఈ దేశంలో అభివృద్ధి విధ్వంసం సృష్టించి అసమానతలు పెంచి, సంపద పోగేసి, సహజ న్యాయాలను, సహజవనరులను కొల్లగొట్టిన ప్రభుత్వాలకు, రాజ్యానికి, అతనొక పెను సవాల్. కలష్నికోవ్ ఎక్కుపెట్టిన ఒక కిషన్ జీ చరిత్ర మీకు పీడ కలలు మిగులుస్తుంది. సమాజం అస్తవ్యస్తంగా ఉన్నంత కాలం.. మనుషులు కిషన్ జీ కోసమే ఎదురుచూస్తుంటారు. అతని శవం కోసం కాదు. అతను భారత దేశపు పీడిత జనుల రక్తంలో కలిసిపోయినవాడు. కాఫీ క్లబ్ల్లో, రంగస్థలాల మీద అతను తారుమారు నాటకాల తెరదించగల సమర్థ యోధుడు. కలలో, మెలకువులో చిరకాలం జీవిం చి ఉండేవాడు. కిషన్ జీని చంపడం సాధ్యమా? మధురమ్మ వలపోస్తున్నది.
‘నీకు అడివిల చలి పుడుతలేదా? నిన్ను శవంగ చేసి మూటగట్టి పడేసిండ్రా? కొడుకా! కన్నపేగు కదులుతుందిరా’ కన్నతల్లి కదిలి కదిలి ఏడుస్తున్నది. కానీ పాదాలు చెక్కేసి, ముఖం చెక్కేసి కోటేశ్వరరావు పార్థివ దేహం మూటగట్టి వస్తున్నది. తట్టుకోగలవా.. తల్లీ..రాజ్యం క్రూరమైన జంతువు. అది వేటాడుతుం టుం ది. అనంతంగా.. రాజ్యానికి పీడ కలలిచ్చినవాడు కిషన్ జీ. అతని స్మృతినీ దక్కనివ్వరా! అమ్మా.. నువ్వొక చరివూతను కనిపెంచిన వీరమాతవు. కిషన్ జీ పరివ్యాప్త మవుతున్నాడు. యాదిలో... మనాదిలో...
-(అల్లం నారాయణ)